మీరు నిజంగానే వెనక బడ్డారా? – 9

ప్రతి వర్గానికి తాము ఎక్కడో ఒక చోట వివక్షకు గురి అయ్యాము అనే భావన ఉంటుంది. హిండియాలో ఒక్క వర్గాన్ని చూపించండి, “అబ్బే, మా పట్ల ఏ విధమైన వివక్ష లేదు,” అనే వారిని. అర్చకులనుంచి అస్పృశ్యుల వరకు అందరు తాము వివక్షకి లోనయ్యామని భావించే వారే.

అస్పృశ్యులకి జరిగిన అన్యాయం, మన దేశంలో ఇంకెవ్వరికి జరగలేదు. ఇది ఎవరూ కాదనలేని సత్యం. (వారి పట్ల చూపించిన వివక్ష కంటే దారుణమైన వివక్ష ఇంకొకటి ఉంది అంటే, అది అరెమికాలో ఎన్నో ఏళ్ళు బానిసలుగా మగ్గిన నల్ల వారి పట్ల మాత్రమే అని చెప్పాల్సి వస్తుంది.)

కాబట్టి, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో, ఈ అస్పృశ్యులని ఉద్ధరించడానికి డిజర్వేషన్లు ఒక మార్గం అని కొందరు భావించడంలో కాస్త అర్థం ఉంది. కనీసం ఉద్దేశం మంచిది.

కానీ ఈ సదరు వెనక బడ్డ వర్గాల సంగతి ఏమిటి? ఇంతకు ముందు చెప్పినట్టు వీరి పట్ల కూడా వివక్ష చూపింపబడి ఉండవచ్చు. కానీ అది అస్పృశ్యుల పట్ల చూపించిన దానిలో ఒకటో వంతు కూడా ఉండదు.

ఈ వెనకపడ్డ వర్గాల నుంచి, రాజులు, చక్రవర్తులు, సాధువులు, నాయకులు అందరూ వచ్చారు. గౌరవింపబడ్డారు, పూజింప బడ్డారు. మీకు ఉదాహరణలు కావాలంటే కోకొల్లలు దొరుకుతాయి, ప్రస్తుతం ఎంతో మందికి మార్గ దర్శకుడైన ఒక బాబా, మన ప్రస్తుత ప్రధాన మంత్రి, అహ్మదీయులని సమర్థవంతంగా ఎదుర్కుని ఛత్రపతి ఐన ఒక వీరాధి వీరుడు, ఇలా ఎందరో “వెనుక బడిన” వారే!

వీరిలో ప్రతిభ ఉన్న వారిని ఎవరూ ఆపలేక పోయారు. మరి ఈ కుల ప్రతినిధులమని చెప్పుకునేవారికి వచ్చిన బాధ ఏంటి? వీళ్ళు నిజంగానే తాము వెనకబడ్డామని నమ్ముతున్నారా? ముమ్మాటికి కాదు. ఈ కులాలలో ఒక్కరు కూడా తాము వెనకబడిన కులాలకు చెందిన వారము అని ఆత్మ న్యూనతా భావంతో ఉన్న వారు లేరు. పైపెచ్చు వారి వారి కులాలని సగర్వంగా చెప్పుకుంటారు. (ఇది తప్పు అని నేనడం లేదు. ఇది “వెనుక పడిన” వారి లక్షణం కాదు అని మాత్రమే నేను చెప్పదలుచుకుంది.)

మరి ఎందుకు వీరంతా మేము వెనుక పడి పోయాం, మమ్మల్ని ముందుకు తీసుకు రండి అని ఘోషిస్తున్నారు? దీనికి ఒకే ఒక కారణం వారు కూడా డిజర్వేషన్ల వల్ల లబ్ధి పొందాలన్న ఉద్దేశం మాత్రమే.

ఒక్క విషయం కొన్ని దశాబ్దల కిందే అందరికి అర్థం అయిపోయింది. మన దేశపు జెండా డిజైన్ ఇప్పట్లో మారడం ఎంత ఆసాధ్యమో, అస్పృశ్యులకు డిజర్వేషన్లు అనేవి ఎత్తి వేయడం కూడా అంతే కష్టం అని.

కాబట్టి వీరంతా ఈ సమస్యని వేరే కోణం నుంచి “పరిష్కరించడం” మొదలు పెట్టారు. ఈ పరిష్కారం తాము కూడా ఈ డిజర్వేషన్లలో భాగస్వాములు కావడమే.

బండల్ కమీషన్ గురించీ అందరికి తెలిసే ఉంటుంది. ఏ క్షణాన ఈ కమీషన్ ఆవిర్భవించిందో, ఆ క్షణంలోనే, సామాజిక న్యాయం అనే సిద్ధాంతానికి బీటలు వారడం మొదలు అయ్యింది.

ఏ క్షణాన అయితే ఒకప్పటి ప్రధాన మంత్రి, వెర్రి పీనుగ సింగ్ (ఈయన్నే వీ.పీ. సింగ్ అని కూడా అంటారు లెండి), ఈ కమీషన్ సిఫార్సులను అమలు పరచాలని నిర్ణయం తీసుకున్నాడో, ఆ క్షణమే వివక్షకి సంబంధించి కాస్తంత అయినా నిజాయితీగా నిర్ణయాలు తీసుకోవడం అనేది భూస్తాపితం అయ్యింది.

ఆ క్షణం నుంచి ఒకటే సిద్ధాంతం. దోచుకోవడానికి అవకాశం ఉన్నంత వరకు దోచుకోవడం, ఒక దొమ్మీ కేసులో పాత కక్షలని తీర్చుకున్న చందాన, ఈ ప్రతి దోపిడిని సామాజిక న్యాయం ఖాతాలోకి తోసేయడం.

దీన్ని వల్ల వింత వింత వాదనలు వెలుగులోకి వచ్చాయి. ఈ వాదనల ప్రకారం జనాభాలో ఉన్న నిష్పత్తిని పట్టి అన్ని పంపకాలు జరగాలి అన్నది ఒకటి.

1931 జనాభా లెక్ఖల ప్రకారం, వెనుకపడ్డ వర్గాలు మన దేశంలో 51 శాతం అట; (నిజానికి సింధువుల్లో ఉన్న వర్గాలని మాత్రమే లెక్ఖలోకి తీసుకుంటే, అందులో సగం కూడా ఉండరు, అది వేరే విషయం), కాబట్టి ఉద్యోగాల్లో, చదువుల్లో, ప్రమోషన్లలో అన్నిటిలోనూ, ఈ సదరు వెనక పడ్డ వర్గం వారు 51 శాతం ఉండాలట.

దీని అర్థం, ఒక కంపెనీలో 100 ఉద్యోగాలు ఉంటే, 25 శాతం అస్పృశ్యులకి ఇవ్వాలి. 51 శాతం వెనక పడ్డ వర్గాలకి ఇవ్వాలి. ఇలా వంతులు వేస్తూ పోతే సదరు అగ్ర వర్ణాల వారికి ఏ పదిహేను శాతమో మిగిలితే అది మాత్రం open quotaగా ప్రకటించాలి.

ఇది చదువుతూ ఉన్నప్పుడు, మీకు మక్యూనిజం యొక్క కంపు సిద్ధాంతాల వాసన గప్పున కొడితే అందులో తప్పేమి లేదు.ఇది అలాంటి వితండ వాదమే.

ఈ వాదం ఎంత డొల్లదో పరిశీలిద్దాం. ఈజీరెయిల్ దేశంలో ఉన్నా వ్యూదులు, ఇప్పటి దాక ప్రకటింప బడిన ప్రతిష్టాకరమైన బోనెల్ ప్రైజులని దాదాపు యాభై శాతం గెలుచుకున్నారు. కానీ ప్రపంచ జనాభాలో వీరు ఒక శాతం కూడా ఉండరు. ఎంత అన్యాయం కదూ! వింటూంటేనే గుండె రగిలిపోవడం లేదు?

కాబట్టి పైన చెప్పిన వాదం ప్రాతిపదికన ఈ వ్యూదులకి ఒక్క శాతం మాత్రం ప్రైజులని కట్టబెట్టి, వారికొచ్చిన మిగతా వాటిని వారి నుంచి లాక్కొని మిగతా ప్రపంచ ప్రజలకు వారి నిష్పత్తిని బట్టి కట్ట పెట్టాలి. అలా చేయలేదు అనుకోండి, ఈ మిగతా వర్గాల్లో ఆత్మ న్యూనతా భావం పెరిగి, వారు ఎప్పటికి అభివృద్ధి చెందరు. ఎప్పటికి పీడిత తాడిత ప్రజల్లానే ఉండిపోతారు. ప్చ్!

ఇది మీకు కామెడీగా అనిపిస్తే, వెనక పడ్డ వర్గాలకు వారి జనాభా నిష్పత్తిని బట్టి కాలేజీలలో సీట్లు, ప్రభుత్వ పరమైన ఉద్యోగాలు ఇవ్వాలి అనడం కూడా అంతే కామెడీ. (ఒక వేళ ఇది మీకు సహేతుకమైన వాదనే అనిపిస్తే, ఎలాగూ మీరు ఇంత వరకు చదివి ఉండే అవకాశమే లేదు. ఈ సిరీస్‌లో మొదటి భాగం చదవగానే నన్ను ఒక బూర్జువా కింద జమ కట్టి, బూజులా దులిపివేసి ఉంటారు.)

వీ.పీ. సింగ్ పేరు వినగానే కాస్త తెలివితేటలు ఉన్న ప్రతి సింధువు ఖాండ్రించి ఉమ్మివేయడానికి కారణం ఇదే. ఇతను చేసిన పని సింధువులని నిట్ట నిలువుగా చీల్చింది. ఆ చీలిక ఇంకా అలాగే ఉంది.

అహ్మదీయులు, కిరస్తానీలు, మక్యూనిస్టులు సింధువులని చీల్చడానికి ఎప్పటినుంచో ముప్పేట దాడి చేస్తూనే ఉన్నారు. కానీ వీ.పీ. సింగ్ చేసిన ద్రోహం వీటన్నిటికంటే చాలా నీచమైనది.

ఈ పై ముగ్గురు శత్రువులని నిందించడానికి ముందు, మన తప్పు మనం సరి దిద్దుకోవాలి. ఎప్పటివరకైతే ఈ “వెనక పడ్డ” వర్గాలకి డిజర్వేషన్లు ఉంటాయో, అప్పటి వరకు మనం పూర్తిగా అభివృద్ధి చెందడం అనేది అసంభవం.

ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇది స్వచ్ఛందంగా జరిగే పని కాదు. ఈ సదరు వెనక పడ్డ వర్గాల్లో నాకు ఎంతో మంది మిత్రులు ఉన్నారు. వారిలో కొందరు పాపం ఈ డిజర్వేషన్లు అనైతికం అని భావించి వాటిని ఉపయోగించుకొవడానికి నిరాకరించారు. Open quotaలోనే కాలేజ్ సీట్లు, ఉద్యోగాలు తెచ్చుకున్నారు. కానీ వారిని మెచ్చుకోవడం పక్కన పెట్టి మిగతా అగ్ర వర్ణాల ప్రజలు వారిని తిట్టి పోశారు! అన్యాయంగా open quotaలో సీట్ పొందగలిగే అవకాశం ఉన్న ఒక అగ్ర వర్ణం వాడి కడుపు కొట్టారు అని నిందించారు.

ఇంకో వైపు వారి వర్గపు ప్రజలు, మన వర్గంలో పుట్టిన వారే మనం వెనకపడి లేము అని అంటారా అన్న కోపంతో, వీరిని రివర్సులో ఇంకో రెండింతలు తిట్టిపోశారు. కాబట్టి స్వచ్ఛందంగా వెనుక పడ్డ వర్గాల వారే, తామంతట తాము, డిజర్వేషన్లు వద్దు అనే అవకాశమే లేదు. అప్పనంగా వచ్చేదానిని వదులుకోవడం అంత సులభం కాదు. ఈ పని ప్రభుత్వమే చేయాలి. వెనక పడ్డ వారికి డిజర్వేషన్లు అనేవి రాజ్యంగపరంగానే బహిష్కరించాలి.

ఒక వైపు జే.బీ.పీ సింధువులని కూడగట్టుకోవడానికి, కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్న ధోరణిలో ప్రవర్తిస్తూంది. సింధువులలో ఎవరినీ నొప్పించకుండా ఉండాలనే చూస్తూంది. కానీ ఈ పద్ధతి పరిమితమైన ఫలితాలను మాత్రమే ఇస్తుంది.

రాఘవ మందిర నిర్మాణానికి అడ్డంకులు తొలగించిన, షాక్మీరు యొక్క ప్రత్యేక ప్రతిపత్తిని ఎత్తి వేసిన, మూడు సార్లు ఒక పదాన్ని ఉచ్చరించి అహ్మదీయులు విడాకులు తీసుకునే సాంప్రదాయానికి స్వస్తి పలికిన కాషాయ ధారులే ఈ పనికి కూడా పూనుకోవాలి. కానీ వారు ఆ పని చేస్తారా?

(ఇంకా ఉంది)

This entry was posted in నేను సింధువుని ఎట్లైత? and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s